వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బావిలో పడి రైతు మృతి
Published on Thu, 07/28/2016 - 09:09
విజయనగరం : పంట పొలంలో మోటర్ వేసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండలం కనిమెళ్ల గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వాళ్లి అబద్ధం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి మోటర్ వేసేందుకు వెళ్లి బావిలో పడి మృతి చెందాడు.
మోటర్ వేసేందుకు బావి వద్దకు వెళ్లి... అబద్ధం ఎంతకీ ఇంటికి తిరగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురైయ్యారు. దాంతో వారు గురువారం ఉదయం పొలం వద్దకు చేరుకుని... గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో అబద్దం బావిలో మృతదేహమై పడి ఉన్నాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. స్థానికుల సహాయంతో అతడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
Tags