amp pages | Sakshi

ఉద్యమాన్ని నీరుగార్చే యత్నం

Published on Mon, 10/12/2015 - 01:39

♦ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం
♦ సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు సిగ్గుచేటు
♦ రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారు
♦ ఉద్యమం చేస్తోంది ప్రత్యేక హోదా కోసం... జగన్ కోసం కాదు
♦ తప్పుడు గ్లూకోమీటర్‌లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు
♦ రక్తనమూనాలు ట్యాంపర్ చేస్తున్నారు
 
 సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చేందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మండి పడ్డారు.  రాష్ట్రమంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా వేదికపై ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘డాక్టర్లు వ్యవహరిస్తున్న పద్ధతి మంచిది కాదు. యూరినల్ శాంపిల్స్ కావాలంటే నేరుగా డాక్టర్లు, మీడియా సమక్షంలో ఇస్తా. రాజకీయ అవసరాల కోసం వైద్య రంగాన్ని వాడుకుంటున్నారు. ఉద్యమాన్ని నీరు గార్చేందుకు కుట్ర పన్నుతున్నారు.

చంద్రబాబు ఇటువంటి వాటికి పాల్పడడం సిగ్గుచేటు.’ అని జగన్ అన్నారు. ‘ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్నది నాకోసం కాదు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులకు, ప్రజలకు మంచి జరుగుతుంది అని దీక్ష చేస్తుంటే  రాజకీయాలు చేయడం సరికాదు. నేను రాజకీయాలు చూశాను గానీ ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా చూడలేదు. అబద్ధాలు చెబుతున్నారు.’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా నాన్న ముందు డాక్టర్. ఆ తరువాతే రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. పులివెందులలో మా మామ పేరున్న డాక్టర్. ఇప్పటికీ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారు.

’ అని జగన్ ఉద్వేగంగా అన్నారు. ‘ఇక్కడ నుండి నమూనాలు తీసుకెళుతున్నారు అక్కడ టాంపర్ చేస్తున్నారు. వైద్యపరీక్షల ఫలితాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు. తప్పుడు గ్లూకో మీటర్ తెచ్చి దీక్షపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు తెచ్చిన గ్లూకోమీటర్ 88 చూపిస్తుంటే కొత్త గ్లూకోమీటర్ 77 చూపిస్తోంది. డాక్టర్లు, సూపరింటెండెంట్‌లు మారాలి. మంత్రులు మాట కాదు దేవుడి మాట వినాలి.’ అని జగన్ వ్యాఖ్యానించారు.

Videos

అమెరికాలో ప్రమాదంలో ప్రాణాలు విడిచిన తెలంగాణ యువకుడు

చంద్రబాబుకి బయపడి గుళ్లలో తలా దాచుకుంటున్నారు..

తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం

కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది

పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి

ఏపీ ఎన్నికల అల్లర్ల పై సిట్ విచారణ.. ఇప్పటికే పోలీసుల ఫై వేటు

మోడీపై పోటీ చేస్తున్న శ్యామ్ కు షాక్..

మాట నిలబెట్టుకునే మా అన్నకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి

అచ్చెన్నాయుడు రిగ్గింగ్.. అడ్డుకున్న వారిపై దాడి

ప్రేమ పేరుతో యువకుడిని మోసం చేసిన యువతి

Photos

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)