రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గిరిజనులకు టోపీ పెట్టి....!
Published on Mon, 10/24/2016 - 23:36
గ్రానైట్ తవ్వకాలకు అనుకూలమంటూ వినతులు
గ్రీవెన్స్సెల్కు తీసుకొచ్చిన కంపెనీల ప్రతినిధులు
పార్వతీపురం: మండలంలోని బోడికొండ, బడేదేవరకొండల్లో గ్రానైట్ తవ్వకాలకు అడ్డగోలుగా అనుమతులు పొందిన కంపెనీలు తన కార్పొరేట్ తెలివితేటలను ఉపయోగించాయి. దీన్లో భాగంగా సోమవారం స్థానిక ఐటీడీఏలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ నిర్వహించిన గ్రీవెన్స్కు కొంతమంది గిరిజనులకు టోపీలు పెట్టి, రంగు రంగుల యూనిఫాం వేయించి, తమకు గ్రానైట్ తవ్వకాలు కావాలనే బ్యానర్లతో ఐటీడీఏ కార్యాలయానికి కంపెనీ ప్రతినిధులు తీసుకొచ్చారు. గ్రానైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐక్య పోరాట సమితి గిరిజనులు ఐటీడీఏ కు వచ్చేసరికి వీరు పలాయనం చిత్తగించారు. ఆ సమయంలో ఆ కంపెనీ ప్రతినిధి ఆ గిరిజనులను బతిమాలుతూ కలెక్టర్ గ్రీవెన్స్లో పోలీసుల అండదండలతో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనుకూల ప్రతికూల వర్గాల మధ్య కొట్లాట జరుగుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు.
#
Tags