రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆరోపణలు తగదు
Published on Tue, 09/12/2017 - 22:11
– బిషప్ పుష్పలలిత
నంద్యాలవిద్య : సీఎస్ఐ ట్రస్టు అసోసియేషన్ స్టేక్ హోల్డర్స్ కమిటీ సభ్యులు తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని నంద్యాల డయాసిస్ బిషప్ పుష్పలలిత అన్నారు. మంగళవారం చర్చి ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యక్తిగత కారణాలచేత తనపై కక్ష సాధించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన పరిపాలనలో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని.. ‘పరిశుద్ధ సిలువపై ఒట్టేసి చెబుతున్నా..నేను ఎలాంటి పాపంచేయలేదు’ అంటూ స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసున్నవారు గతంలో డయాసిస్ పెద్దలపై దుర్భాషలాడారని, వారిపై క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకున్నానేతప్ప ఎటువంటి కక్షసాధింపు చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ ప్రసిడెంట్ రెవరెండ్ ఏసురత్నం, సెక్రటరీ గంగు ఆనంద్, కోశాధికారి రత్నరాజు, గురువులు పాల్గొన్నారు.
#
Tags