అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హెడ్ పోస్టాఫీసులో 25 పైసల స్టాంపులు
Published on Wed, 04/26/2017 - 00:22
– విడుదల చేసిన పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు
కర్నూలు(ఓల్డ్సిటీ): ఎట్టకేలకు కర్నూలు హెడ్ పోస్టాఫీసుకు 25 పైసల స్టాంపులు వచ్చేశాయి. వీటిని పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు మంగళవారం తన ఛాంబరులో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచురణ కర్తలు, పబ్లిషర్లు తమ పత్రికలను బుక్పోస్టు ద్వారా వేరే ప్రాంతాలకు పంపించుకునే వారని, కొన్ని నెలలుగా ఈ స్టాంపుల ముద్రణ లేకపోవడం వల్ల పోస్టాఫీసుల్లో లభించక పబ్లిషర్లు 50 పైసల స్టాంపులు అతికించి మరో 25 పైసలు నష్టపోయేవారన్నారు. ఈ అంశాన్ని సాక్షి గతంలో కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. మంగళవారం నుంచి పోస్టాఫీసుల్లో 25 పైసల స్టాంపులను అందుబాటులో ఉంచారు. స్టాంపుల విడుదల కార్యక్రమంలో సిబ్బంది నాగవెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
#
Tags