రోడ్డుపై విషమంగా వ్యక్తి.. పిలిచినా రాని '108'

Published on Mon, 02/01/2016 - 21:33

నందికొట్కూరు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని సత్వరమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే సదుద్దేశంతో తీసుకొచ్చిన పథకం '108'. ఒక్క ఫోన్‌ కాల్‌తో బాధితులను ఆదుకొని.. ప్రాణాలు నిలబెట్టాల్సిన '108' పథకం నానాటికీ నీరుగారిపోతున్నది. తాజాగా ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై.. విషమ పరిస్థితిలో ఉన్నా.. '108' సిబ్బంది సకాలంలో స్పందించలేదు. దీంతో రోడ్డుమీద విలవిలలాడుతున్న బాధితుడిని స్థానికులే ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరు శివారులో సోమవారం రాత్రి జరిగింది. బైక్‌పై వెళుతున్న మధు (35) అనే వ్యక్తిని ఓ వాహనం ఢీకొనడంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో స్థానికులు 108కు ఫోన్‌ చేశారు.  అరగంట అయినా '108' అంబులెన్స్ సంఘటనాస్థలానికి చేరుకోలేదు. దీంతో స్థానికులే అరగంట తర్వాత బాధితుడిని వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ