Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సుషాంత్ మరణం టిక్టాక్లో చూసి..
Published on Fri, 06/19/2020 - 11:46
సాక్షి, విశాఖపట్నం : సుషాంత్ సింగ్ మీద ఉన్న అభిమానం ఆమెను ఆత్మహత్య పాల్పడేలా చేసింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా మల్కాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్ పుత్ర నగర్కు చెందిన సుమన్ కుమారి టిక్ టాక్ వీడియోలు చూడడం బాగా అలవాటు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ మరణంకు సంబంధించి టిక్ టాక్లో తరచూ వీడియోలు చూస్తుండేది. ఈ నేపథ్యంలో సుషాంత్ మృతి పట్ల తీవ్ర ఒత్తిడికి గురైన సుమన్ కుమారి ఇంట్లోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్పుత్ గత ఆదివారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.
#
Tags