More

కొత్త పనిమనిషి పనే

30 May, 2019 08:41 IST
నిందితురాలు ఆండాలు

వజ్రాభరణాల దొంగ రిమాండ్‌

బంజారాహిల్స్‌: శ్రీనగర్‌ కాలనీలోని చల్లా డోయెన్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే డాక్టర్‌ పద్మ వీరపాని ఇంట్లో రూ.3 లక్షల విలువైన వజ్రాభరణాలు దొంగిలించిన కేసులో నిందితురాలిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. డాక్టర్‌ పద్మ వీరపాని ఈ నెల 27న ఉదయం ఓ శుభకార్యానికి వెళ్లే క్రమంలో జ్యువెల్లరీ బాక్స్‌లో చూడగా అందులో ఉన్న వజ్రాల గాజులు కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు భావించి అదే రోజు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనుమానితులను విచారించారు. నాలుగు వారాల క్రితమే ఆమె ఇంట్లో పనికి కుదిరిన బాలానగర్‌ మూసాపేట్‌కు చెందిన రాపంతు ఆండాలు అలియాస్‌ సుధ(35) చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆభరణాలను స్వాధీనం చేసుకొని నిందితురాలిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ క్రైం ఎస్‌ఐ భరత్‌భూషణ్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు :
Tags


మరిన్ని వార్తలు

చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి

భార్యను 41 సార్లు స్క్రూడ్రైవర్‌తో పొడిచి.. దారుణ హత్య

వివాహిత దారుణ హత్య

Nov 16th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

విద్యుత్‌ శాఖ అటెండర్‌ యాదమ్మ దారుణ హత్య