భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన భార్య

Published on Thu, 12/12/2019 - 09:43

సాక్షి, తిరువొత్తియూరు: కాలి గొలుసులను తాకట్టు పెట్టి మద్యం తాగడంతో ఆగ్రహం చెందిన భార్య భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించింది. తీవ్ర గాయాలైన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విల్లుపురం జిల్లా కండమంగళం మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన సెంథిల్‌ (36) తాపీమేస్త్రీ. అతని భార్య చిత్ర (32). వీరికి వెట్రివేల్‌ (12), హరీష్‌ (10), అనే ఇద్దరు కుమారులు వున్నారు. సెంథిల్‌కు మద్యం అలవాటు ఉంది. పనికి వెళ్లకుండా మద్యం తాగి వచ్చి ఇంటిలో గొడవ చేసేవాడని తెలిసింది. మంగళారం చిత్ర కూలికి వెళ్లడంతో ఇంటిలో ఒంటరిగా వున్న సెంథిల్‌ మద్యం తాగడానికి డబ్బులు లేకపోవడంతో భార్య కాలి గొలుసులను రూ.1500లకు తాకట్టు పెట్టి ఆ నగదుతో మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

పని ముగించుకుని ఇంటికి వచ్చిన చిత్ర తన కాలి గొలుసులు కనపడకపోవడంతో భర్తను నిలదీసింది. అతను తాకట్టు పెట్టి మద్యం తాగినట్టు తెలియడంతో ఆగ్రహం చెంది అతనితో వాగ్వాదానికి దిగింది.  తరువాత అందరూ నిద్రపోయారు. ఆగ్రహం చల్లారని చిత్ర ఇంటి ముందు నిలబెట్టి వున్న సెంథిల్‌ బైకు నుంచి పెట్రోలు ఓ బాటిల్‌లో పట్టుకుని నిద్రపోతున్న సెంథిల్‌పై పోసి నిప్పు అంటించింది. మంటలు అంటుకోవడంతో సెంథిల్‌ కేకలు పెట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సెంథిల్‌ను పుదుచ్చేరి కారిమేడు జిప్మర్‌ ఆస్పత్రికి తరలించారు.   సమాచారం అందుకున్న కండామంగళం పోలీసులు కేసు నమోదు చేసి చిత్ర వద్ద విచారణ చేస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ