amp pages | Sakshi

‘మేం కూటికి పేదవాళ్లమే.. గుణానికి కాదు’

Published on Sat, 11/10/2018 - 06:41

ఆమె నిరుపేద. ఆ పెద్దాయన ఇంటిలో పని మనిషిగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది. ఇన్నేళ్లుగా నమ్మకంతో పనిచేస్తున్న ఆమెపై ఆ ఇంటి పెద్దోళ్లు అభాండం వేశారు. దీనిని ఆమె అవమానంగా భావించింది... భరించలేకపోయింది... బలవంతంగా తన ప్రాణాలను తానే బలి తీసుకుంది. ఆ అభిమానవతి, అభాగ్యురాలు... మద్దికుంట భార్గవి. అభియోగం మోపిన ఆ పెద్దోళ్లు...పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులు..

ఖమ్మంక్రైం: తనకు దొంగతనం అంటగట్టడాన్ని భరించలేని ఓ నిరుపేద ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబీకులు తెలిపిన వివరాలు... నగరంలోని శ్రీనివాస్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఆమె పేరు మద్దికుంట భార్గవి(35). ఆమెకు భర్త బాలరాజు (మార్కెట్‌లో హమాలీ), పిల్లలు మౌనిక, సంతోష్‌ ఉన్నారు. ఆమె గత 15 సంవత్సరాలుగా జమలాపురం కేశవరావు పార్క్‌ సమీపంలోగల టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు పులిపాటి ప్రసాద్‌ ఇంట్లో పనిచేస్తోంది. ఆమెది రెక్కాడితేకాని డొక్కాడని కటుంబం. కుటుంబం గడవటానికి పూలు కూడా కట్టేది. తమ ఇంట్లో భార్గవి దొంగతనం చేసిందంటూ కొన్ని రోజుల క్రితం పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులు అభాండం వేశారు.

తనకు ఏ పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఆమె ఎంతగా నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా వారు వినలేదు. ఇన్నేళ్లపాటు ఎంతో నమ్మకంగా పనిచేసిన తనపై ఇంతటి అభాండం మోపారంటూ భర్తతో చెప్పి ఏడ్చింది. తనకు రావాల్సిన జీతం డబ్బులు 6000 రూపాయలు తీసుకునేందుకని యజమాని ఇంటికి శుక్రవారం వెళ్లింది. అక్కడ ఆమెను పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులు తీవ్రంగా దూషించారు. అనరాని మాటలు అన్నారు. జీతం డబ్బులు ఇవ్వకుండా వెళ్లగొట్టారు. ‘‘మేం కూటికి పేదవాళ్లమే. గుణానికి మాత్రం కాదు’’ అని, చెబ్బబోయినా వినలేదు. అక్కడ జరిగిన అవమానాన్ని భరించలేకపోయింది. ఆమెకు గుండె పగిలినట్టయింది. ఇంటికి వచ్చింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. కూతురు మౌనిక.. కళాశాలలో, కుమారుడు సంతోష్‌.. పాఠశాలలో, భర్త బాలరాజు.. మార్కెట్‌లో ఉన్నారు. ఆమె అత్త బాలామణి కూడా ఊరికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన భర్త బాలరాజు... ఉరికి వేలాడుతున్న భార్యను చూసి షాకయ్యాడు. బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు. ఆమెను కిందక దించారు. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వచ్చారు. భార్గవి ఆత్మహత్యపై ఆమెతో పనిచేయించుకుని, అభాండాలు వేసినట్టుగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఇంటి యజమాని పులిపాటి ప్రసాద్‌ కుటుంబీకులను ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘మేము భార్గవిని వేధించలేదు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదు’’ అన్నారు. త్రీ టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)