కోళ్లపై కన్నేసి.. విషంతో కాటేసి..

Published on Mon, 07/01/2019 - 15:11

భోపాల్‌ : తాను పెంచుకుంటున్న కోళ్లలో ఒక కోడిని ఇచ్చేందుకు మహిళ నిరాకరించడంతో ఇద్దరు వ్యక్తులు ఆమెకు చెందిన కోళ్లను విషమిచ్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. ఝాన్సీరోడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మహిళ గుడ్డిభాయ్‌ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం...వైష్ణో ధామ్‌ ఆలయ సమీపంలో నివసించే గుడ్డి భాయ్‌ వ్యవసాయ పనులకు వెళుతూ మరికొంత ఆదాయం కోసం నాలుగు కోళ్లను కొనుగోలు చేసి కోడిగుడ్లను విక్రయిస్తూ జీవిస్తోంది.

ఈమె పొరుగున ఉండే సురేందర్‌, సమర్‌లు ఆమె పనులకు వెళ్లిన సమయంలో మహిళ ఇంటికి వెళ్లి తమకు ఓ కోడిని ఇవ్వాలని కోరగా ఆమె కుమార్తె నిరాకరించడంతో నాలుగు కోళ్లకు విషం ఎక్కించారు. పని నుంచి ఇంటికి వచ్చిన మహిళకు కుమార్తె నిందితుల నిర్వాకం వివరించడంతో చనిపోయిన కోళ్లను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ