amp pages | Sakshi

ఇద్దరి ఉసురు తీసిన మద్యం మత్తు

Published on Thu, 06/14/2018 - 10:55

ముండ్లమూరు: మండలంలోని రెడ్డినగర్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి మద్యం మత్తుతో పాటు అతివేగమే కారణంగా తెలుస్తోంది.   పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్లగల్లు పంచాయతీ పరిధి రెడ్డినగర్‌కు సమీపంలో అద్దంకి–దర్శి ప్రధాన రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో రెడ్డినగర్‌ గ్రామానికి చెందిన మేడగం వెంకటేశ్వరరెడ్డి (50) అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వరరెడ్డి భార్య తిరుపతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం గ్రామానికి చెందిన దిగుడు శ్రీనివాసరావు (26) కూడా ఇదే ప్రమాదంలో మృతి చెందాడు. రెడ్డినగర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, తిరుపతమ్మ దంపతులు ఉల్లగల్లులో జరుగుతున్న బ్రహ్మంగారి వార్షికోత్సవానికి వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరారు. మార్కాపురం గ్రామానికి చెందిన దిగుడు శ్రీనివాసరావు ముండ్లమూరు మండలం వేములబండలో ఉంటున్న తన భార్యను చూసేందుకు బయల్దేరాడు.

మార్గమధ్యంలో దర్శిలో మద్యం తాగి వేములబండకు వస్తున్నానని తన మామ యలమందరావుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు.  మార్గమధ్యంలో రెడ్డినగర్‌ వద్ద ఎదురుగా వస్తున్న వెంకటేశ్వరరెడ్డి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో వెంకటేశ్వరరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన భార్య తిరుపతమ్మ భర్త మృతదేహం వద్ద భోరున విలపించింది. శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వస్తున్న అద్దంకి సీఐ హైమారావు క్షతగాత్రులు వ్రీనివాసరావు, తిరుపతమ్మలను ఆటోలో దర్శి వైద్యశాలకు తరలించారు. దర్శికి చేరుకునేలోపు శ్రీనివాసరావు కూడా మృతి చెందాడు. తిరుపతమ్మకు ప్రథమ చికిత్స అనంతరం మురుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు.

శ్రీనివాసరావు చివరి ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు అతడి మామ యలమందరావుకు సమాచారం ఇచ్చారు. దర్శి సీఐ ఎం. శ్రీనివాసరావు, ఎస్‌ఐ శివనాంచారయ్యలు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వరరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మృతుడు శ్రీనివాసరావుకు భార్య అనూష ఉన్నారు. అనూష ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భిణి. మార్కాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వేములబండకు చెందిన యలమంద కుమార్తెను వివాహం చేసుకొని కొంతకాలంగా వేములబండలోనే ఉంటూ జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఇక్కడ పని లేకపోవడంతో స్వగ్రామం మార్కాపురంలో ఉంటున్నాడు. భార్యను చూసేందుకు వస్తూ ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మృతి చెందాడని సమాచారం తెలియడంతో అనూష కన్నీరుమన్నీరైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాంచారయ్య తెలిపారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)