amp pages | Sakshi

అధికారుల వేధింపులే బలిగొన్నాయా ?

Published on Fri, 06/22/2018 - 09:04

వెదురుకుప్పం/కార్వేటినగరం : దుప్పి మాంసం ఉందన్న అనుమానంతో కార్యాలయానికి తీసుకెళ్లి వేధించడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని వెదురుకుప్పం మండలం మాం బేడు పంచాయతీ పురుషోత్తమపురం యానాది కాలనీకి చెందిన వెంకటయ్య(65) భార్య ఆదిలక్ష్మి, కుమా రుడు అంజేరి ఆరోపించారు. వారు గురువారం యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, గ్రామస్తులతో కలిసి కార్వేటినగరంలోని అట వీశాఖ కార్యాలయం వద్ద వెంకటయ్య మృత దేహంతో ధర్నాకు దిగారు. ఆమె మాట్లాడుతూ వెంకటయ్య సమీపంలోని మామిడి తోటలో కాపలా ఉంటున్నాడని వాపో యింది. వారం క్రితం దుప్పి మాంసం ఉందన్న సమాచారంతో కార్వేటినగరం అటవీ శాఖ అధికా రులు అదుపులోకి తీసుకుని చితకబాదారని తెలిపింది.

మళ్లీ కేసులు పెడతామంటూ బెదిరించడంతో తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని కన్నీరుమున్నీరైంది. జిల్లా యానాది సంక్షేమ సం ఘం అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న యానాదులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చిత్రహింసలు పెట్టడం వల్లే వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. వెంకటయ్య మృతికి కారుకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న  స్థానిక సీఐ చల్లనిదొర, ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆందోళనకారులతో చర్చించారు. విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు.
వెంకటయ్య మృతితో సంబంధం లేదుఅటవీశాఖ అధికారి శివన్న వివరణ ఇస్తూ ఈ నెల 12వ తేదీ దుప్పి మాంసాన్ని పంచుతున్నట్లు అందిన రహస్య సమాచారంతో సిబ్బంది అక్కడికి చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మరో ముగ్గురు పరారయ్యారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం నిందితులకు జరిమానా విధించామని, దాడి చేయలేదన్నారు. వెంకటయ్య మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
అమాయకులైన ఎస్టీలపై దాడులు చేసి వ్యక్తి మృతి కి కారకులైన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీనెల్లూరు ఎమ్మెల్యే కే.నారాయణస్వామి డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ వెదురుకుప్పం మండలంలో వెంకటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, అతని మృతికి అధికారుల వేధింపులే కారణమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాల న్నారు.
వెంకటయ్య ఆత్మహత్యకు అటవీ అధికారులే కార ణం అని జిల్లా వ్యవసాయ రైతు కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వందవాసి నాగరాజ ఆరో పించారు. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)