రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం
Published on Thu, 04/26/2018 - 08:17
లక్నో : ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్ను రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులతోపాటు డ్రైవర్ కూడా దుర్మరణం పాలయ్యారు. కుశినగర్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
డివైన్ పబ్లిక్ స్కూల్కు చెందిన వ్యాన్ పిల్లలను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద దాటుతుండగా.. వేగంగా వస్తున్న రైలు ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా, ఈ నెలలో ఇది రెండో ఘటన. ఏప్రిల్ 10వ తేదీన హిమాచల్ ప్రదేశ్ కంగారాలో ఓ స్కూల్ బస్సు లోయలో పడి 27 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.
#
Tags