షాద్‌ నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Published on Fri, 10/11/2019 - 17:53

సాక్షి, హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా పడిన దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వీరంతా స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్లేందుకు హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయల్దేరారు. అయితే షాద్‌ నగర్‌ టోల్‌గేట్‌ వద్దకు రాగానే ముందు వెళుతున్న మరో కారును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో మారుతి ఎరిక్టా కారు అదుపు తప్పింది. దీంతో కారు సుమారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ