amp pages | Sakshi

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

Published on Wed, 07/17/2019 - 11:00

సాక్షి, రేణిగుంట(తిరుపతి) : నగలు చోరీ చేయడానికి పోలీసు దుస్తుల్లో వచ్చిన జులాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 1,080 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పాకాల రైల్వేస్టేషన్‌లో గత నెల 11న జరిగిన నగల చోరీ కేసును రేణిగుంట జీఆర్‌పీ పోలీసులు ఛేదించినట్లు  తిరుపతి జీఆర్‌పీ డీఎస్‌పీ రమేష్‌బాబు తెలిపారు. రేణిగుంట జీఆర్‌పీ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్ట్‌ను చూపిన పోలీసులు రికవరీ చేసిన బంగారు ఆభరణాలను ప్రదర్శించారు.

డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు, తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన నగల వ్యాపారి ముకుందరాజన్‌ తరచూ కోయంబత్తూరు నుంచి రైలులో కడప జిల్లా ప్రొద్దుటూరులో నగల దుకాణాలకు బంగారు ఆభరణాలను విక్రయిస్తుంటాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరుకు చెందిన నక్కా రాజశేఖర్‌(24)  ముకుందరాజన్‌ రాక, పోకలపై కన్నేశాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు ప్రొద్దుటూరుకు చెందిన మాజీ సిపాయి పుల్లారెడ్డి(28), యర్రగుంట్లకు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వాహకుడు ప్రసాద్‌(26)తో కలసి ముకుందరాజన్‌ నుంచి నగలను తస్కరించేందుకు పథకం వేశాడు.

 గతనెల 11న కోయంబత్తూరుకు వెళ్లి అక్కడ నుంచి రైలులో ప్రొద్దుటూరుకు జయంతి ఎక్స్‌ప్రెస్‌రైలులో బయల్దేరిన ముకుందరాజన్‌ను వెంబడించారు. రైలులో పుల్లారెడ్డి ఎస్‌ఐ దుస్తుల్లోనూ, ప్రసాద్‌ కానిస్టేబుల్‌ దుస్తుల్లోనూ ముకుంద్‌రాజన్‌ వద్దకు వెళ్లి బ్యాగులను తనిఖీ చేశారు. తాము పోలీసులమని,  బంగారం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం వచ్చిందని బెదిరించి అతని నగల బ్యాగును, రెండు మొబైల్‌ ఫోన్లను తీసుకున్నారు. పాకాల రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే అతనిని కిందికి దింపి, రైల్వే క్వార్టర్స్‌ వైపు వెళ్లారు.

ఉదయం చిత్తూరు 1 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు రావాలని అతనికి చెప్పి, అక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్లిపోయారు. దీంతో నగల వ్యాపారి ముకుంద్‌ ఉదయం చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలిపాడు. రేణిగుంట జీఆర్‌పీ సీఐ అశోక్‌కుమార్‌ కేసు నమోదు చేసి ఎంతో చాకచక్యంగా దర్యాప్తు చేశారు. పాకాల సమీపంలో తిరుగుతున్న నిందితులు రాజశేఖర్, పుల్లారెడ్డి, ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా ప్లాస్టిక్‌ కవరులో బంగారు ఆభరణాలను మూటకట్టి పాకాల సమీపంలోని ఓ గుట్టపై ముళ్లపొదల్లో పాతిపెట్టినట్లు తెలిపారు.

నిందితులను తీసుకెళ్లి ఆ నగలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 21 లక్షల 90వేలు ఉంటుందని తెలిపారు. వారు ఉపయోగించిన పోలీసు దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేధించిన సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐలు అనిల్‌కుమార్, ప్రవీణ్‌ను అభినందిస్తూ వారికి రివార్డులను అందజేయాలని సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్‌పీ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులో కమాండ్‌ కంట్రోల్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బరాయుడు పోలీసుల వేషంలో వెళ్లండని నిందితులకు చెప్పడంతో అతనిపై చర్యలు తీసుకోనున్నారు.  నిందితులను  నెల్లూరు రైల్వేకోర్టుకు రిమిండ్‌ నిమిత్తం తరలించినట్లు తెలిపారు.  

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌