అందువల్లే స్వాతిరెడ్డి కోర్టుకు హాజరుకాలేకపోయింది

Published on Thu, 02/06/2020 - 10:10

మహబూబ్‌నగర్‌ క్రైం: సరిగ్గా రెండేళ్ల తర్వాత స్వాతిరెడ్డి పేరు మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. ఈ కేసులో రెండేళ్ల కిందట ప్రియుడితో కలిసి భర్తను అత్యంత కిరాతంగా హత్య చేయడంతో అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించింది. భర్తను హత్య చేసినందుకు స్వాతిరెడ్డికి అప్పట్లో కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతరం బెయిల్‌పై స్వాతిని 2018 జూలై 27న విడుదల చేశారు. అయితే, ఆమెను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని జైలు నుంచి నేరుగా పట్టణంలోని మెట్టుగడ్డ దగ్గర ఉన్న రాష్ట్ర సదనంకు తరలించారు.

అయితే ఈ కేసులో నాగర్‌కర్నూల్‌ జిల్లా కోర్టుకు వాయిదాల కోసం వెళ్లాల్సి ఉండగా మూడు సార్లు ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి స్వాతిరెడ్డిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో నాగర్‌కర్నూల్‌ పోలీసులు ఆమెను మంగళవారం అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఆమె జైలులో 14రోజుల పాటు శిక్ష అనుభవించనుంది. ఇదిలాఉండగా, స్టేట్‌హోం నుంచి నాగర్‌కర్నూల్‌ కోర్టుకు వెళ్లడానికి సరైన భద్రత, స్థానిక సిబ్బంది నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే ఆమె కోర్టుకు హాజరుకాకపోవడానికి కారణాలుగా తెలుస్తోంది.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ