రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య

Published on Sat, 10/06/2018 - 12:21

కర్ణాటక, కోలారు: పట్టాలపై నడుస్తూ రైలుకు ఎదురెళ్లి పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న  విద్యార్థిని ఉదంతం శుక్రవారం నగరంలోని కారంజికట్ట రైల్వే ట్రాక్‌పై చోటు చేసుకుంది. నగరంలోని హరోహళ్లిలో నివాసం ఉంటున్న    మేఘ మేరిస్‌ (17) నగరంలోని మదర్‌ థెరెసా కళాశాలలో డిప్లోమా చదువుతోంది.  తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఇంటినుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చిన మేఘామేరిస్‌.. ఉదయం 6 గంటల సమయంలో బెంగుళూరుకు వెళ్లే ప్యాసింజెర్‌ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.  రైల్వే  పోలీసులు ఉదయం 9 గంటలకు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు.  మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మేఘామేరిస్‌ ఆత్మహత్యకు అసుల కారణాలు ఇంతవరకు తెలియలేదు.


Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ