amp pages | Sakshi

ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

Published on Sat, 12/07/2019 - 09:48

సాక్షి, హైదరాబాద్‌ :  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతానికి సంబంధించి శుక్రవారం షాద్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న షాద్‌ నగర్‌ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు మేరకు హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్‌ 307) కింద కేసు నమోదు చేశారు. నిందితులను తీసుకుని నేర ఆధారాల సేకరణకు చటాన్‌పల్లిలోని ఘటనా స్థలానికి వెళ్లామని, అక్కడ నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఘటనలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్‌ అరవింద్‌ గౌడ్‌ తీవ్రంగా గాయపడ్డారని, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు నిందితులు హతమైనట్లు వివరించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన షాద్‌ నగర్‌ పోలీసులు దాని ప్రతిని ఆధీకృత న్యాయస్థానానికి సమర్పించారు. మరోపక్క దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. ఓ సమగ్ర నివేదిక రూపొందించి కేంద్ర హోంశాఖకు పంపాయి.

చదవండి: ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌

కాగా గాయపడిన పోలీసులు హైటెక్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ 'నిందితుల రాళ్ల దాడిలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది. కానిస్టేబుల్ అరవింద్‌గౌడ్ కుడి భుజంపై కర్ర గాయాలయ్యాయి. ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని' తెలిపారు.

ఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం వెతుకులాట
ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో పోలీసులు ఉపయోగించిన బుల్లెట్ల కోసం రెండోరోజు కూడా వెతుకులాడుతున్నారు. నలుగురు నిందితులకు 11 బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఘటన జరిగిన ప్రదేశంలో పడిన బుల్లెట్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. డీప్‌ మెటల్‌ డిటెక్టర్‌తో బుల్లెట్ల కోసం బాంబ్‌ స్క్వాడ్‌ బృందం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తోంది. నిన్న రాత్రి నుంచి సంఘటనా స్థలంలో బుల్లెట్ల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే కొన్ని బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)