రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దోపిడీ దొంగల అరెస్ట్
Published on Mon, 09/03/2018 - 13:19
ఒడిశా, బరంపురం: తుపాకీతో ఓ వెండి నగల వ్యాపారిని బెదిరించి, నగదు దోచుకెళ్లిన సుమారు ఐదుగురు దొంగలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక తుపాకీతో పాటు తుపాకీ బులెట్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఇద్దరు వ్యాపారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎస్డీపీవో అశ్వినీకుమార్ అందించిన సమాచారం ప్రకారం... జిల్లాలో కొద్ది రోజుల క్రితం కవిసూర్యనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పత్తర–పండామరి రహదారిలో ఉన్న వెండి నగల దుకాణంలో సుమారు ఐదుగురు దుండగులు ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న వ్యాపారిని తుపాకీతో బెదిరించి, సుమారు ఏడున్నర కిలోల వెండితో పాటు సుమారు రూ. 6 వేలు దోచుకుని పరారయ్యారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దుండగులను అరెస్టు చేసినట్టు ఎస్డీపీవో తెలిపారు.
#
Tags