amp pages | Sakshi

చెట్టును ఢీకొన్నకారు..ముగ్గురి మృతి

Published on Tue, 03/26/2019 - 11:51

సాక్షి, ధర్మారం/కొడిమ్యాల:   రైస్‌మిల్‌ ప్రారంభోత్సవానికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మామ, అల్లుడు, కూతురు మృతిచెందారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.  ఈ ఘటనలో కొడిమ్యాలకు చెందిన రాగి వీరేశం(77), అతని కూతురు కొండూరి పద్మా వతి(50), అల్లుడు మనోహర్‌(55) ప్రాణాలు కో ల్పోగా.. సరోజన చికిత్స పొందుతుంది. కొడి మ్యాల మండల కేంద్రానికి చెందిన వీరేశం, సరోజన దంపతులకు నలుగురు కూతుళ్లు. రెండో కూతురు పద్మావతి, భర్త మనోహర్‌ ముప్పై ఏళ్ల క్రితం కరీంనగర్‌లో స్థిరపడ్డారు. వీరేశం, సరోజన దంపతులు మూడు రోజుల క్రితం కరీంనగర్‌లోని రెండో కూతురు ఇంటికి వెళ్లారు.

సోమవారం నాలుగో కూతురుకు సంబంధించిన రైస్‌మిల్‌ ప్రారంభోత్సవం వెల్గటూర్‌ మండలం గుల్లకోటలో ఉంది. ఈ కార్యక్రమానికి అత్తమామలు వీరేశం, సరోజన, తోడల్లుడు మనోహర్, పద్మావతి దంపతులు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మామఅల్లుళ్లు వీరేశం, మనోహర్‌ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. పద్మావతి, సరోజన తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పద్మావతి ప్రాణాలు విడిచింది. సరోజన చికిత్స పొందుతుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో కొడిమ్యాలలో విషాదం నెలకొంది. మృతుడి అల్లుడు రేణికుంట శ్రీనివాస్‌ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్సై ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ వెంకటరాంరెడ్డి, సీఐ నరేందర్‌ సందర్శించి పూర్తి వివరాలు సేకరించారు.  
  
కొడిమ్యాలలో విషాదం
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో జరిగిన ప్రమాదంతో జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విషాదం అలుముకుంది. అందరితో కలుపు గోలుగా ఉండే వీరేశం మృతితో మండల కేంద్రంలో ఆయన పరిచయస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)