వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాత్రూంలో జారిపడి గర్భిణి మృతి
Published on Fri, 05/04/2018 - 09:04
కామారెడ్డి క్రైం : కాలకృత్యాలకు వెళ్లిన ఓ గర్భిణి కాలుజారిపడిపోవడంతో తీవ్రగాయాలై మృతిచెందిన సంఘటన కామారెడ్డి మండలం టేక్రియాల్లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై కథనం ప్రకారం.. లింగంపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రాధిక (24)కు గత డిసెంబర్లో టేక్రియాల్కు చెందిన గంగారాంతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. బుధవారం రాత్రి ఆమె బాత్రూంలో కాలుజారిపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేవుపల్లి ఎస్సై సంతోష్కుమార్ విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
#
Tags