ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తా 

Published on Sun, 11/10/2019 - 08:47

సాక్షి, గౌతంనగర్‌ : తనను ప్రేమించాలని ఓ యువతిని వేధించడమే కాకుండా ఆమె ఉద్యోగం చేస్తున్న ప్రాంతానికి వెళ్ళి ప్రేమించకపోతే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరిస్తున్న ఓ యువకుడిని మల్కాజిగిరి పోలీసులు శనివారం  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ హరీష్‌ తెలిపిన మేరకు..వసంతపురి కాలనీకి చెందిన సంగ శ్రీనివాస్‌(25) ప్రైవేటు ఉద్యోగి. కాగా ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఓ యువతి(20)ని కొంతకాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని,  లేకపోతే నీ కుటుంబ సభ్యులను యాసిడ్‌పోసి చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఆ యువతి ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్ళి బెదిరింపులు చేయడంతో యువతి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో శ్రీనివాస్‌ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ