నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మళ్లీ బరితెగించిన పాక్..
Published on Tue, 02/06/2018 - 12:49
సాక్షి, శ్రీనగర్: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి భారత ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి, ముగ్గురు జవాన్లను పొట్టన పెట్టుకున్న ఘటన మరువక ముందే జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్లోని మహారాజా హరిసింగ్ హాస్పిటల్లోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
ఉగ్రవాదుల కాల్పులకు భయపడి రోగులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఉగ్రవాదుల ఆకస్మిక కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
#
Tags