భార్య ప్రియుడితో పరార్‌.. వ్యక్తి ఆత్మహత్య

Published on Fri, 07/12/2019 - 07:58

సాక్షి, సిద్దిపేట: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘనట మండల పరిధిలోని రావురూకుల గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్‌ మండలం రావురూకుల గ్రామానికి చెందిన చెత్రి బాలకిషన్‌కు పెద్దమల్లారెడ్డిపేటకు చెందిన లావణ్యతో నాలుగు నెలల కిత్రం వివాహం అయింది.

వారం రోజుల క్రితం లావణ్యను తల్లితండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. ఈక్రమంలో లావణ్య ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయంపై లావణ్య తల్లిదండ్రులు బాలకిషన్‌ ఇంటికి ఫోన్‌ చేసి లావణ్య ఇంటికి వచ్చిందా అడగగా రాలేదని చెప్పారు. దీంతో గ్రామంలో విచారణ చేయగా లావణ్య ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బాలకిషన్‌ 9వ తేదీన తన పెద్దనాన్న కుమారుడికి ఫోన్‌ చేసి బావివద్ద పురుగుల మందు తాగుతున్నట్లు సమాచారం అందించాడు.

దీంతో సంఘటన స్థలానికి కుటుంబ సభ్యులు చేరుకునే సరికి బాలకిషన్‌ను అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రాథమికి చికిత్స అందించిన అనంతరం వైద్యులు గాంధీ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో వారు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, బాలకిషన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ