ప్రియురాలి భర్తపై హత్యాయత్నం

Published on Mon, 08/20/2018 - 13:11

గుంటూరు, తెనాలిరూరల్‌: వివాహేతర సంబంధానికి ప్రియురాలు ఒప్పుకోకపోవడానికి ఆమె భర్తే కారణమని భావించిన ప్రియుడు అతడిపై హత్యాయత్నం చేశాడు. కత్తితో దాడి చేయగా, తీవ్ర గాయాలతో భర్త చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణ రజకచెరువు ప్రాంతానికి చెందిన దామిశెట్టి రమేష్‌ వెండి బంగారు వర్తక సంఘంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్యకు గంగానమ్మపేటకు చెందిన ఆటో డ్రైవర్‌ శ్రీనుతో సుమారు ఐదున్నరేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ప్రవర్తనను మార్చుకోవాలని భర్త సూచించడంతో కొంతకాలంగా ఆమె శ్రీనుకు దూరంగా ఉంది. రమేష్‌ కారణంగా తన ప్రియురాలు దూరంగా ఉంటోందని, అతడి అడ్డు తొలగించాలని భావించిన నిందితుడు శ్రీను శనివారం రాత్రి ఇంటికి వెళుతున్న రమేష్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని స్థానికులు ప్రకాశం రోడ్డులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. బాధితుడు రమేష్‌  ఫిర్యాదును టూ టౌన్‌ ఎస్‌ఐ పి. సురేష్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ