దారుణం : ఐసీయూలో మైనర్‌ బాలికపై అత్యాచారం

Published on Sun, 11/04/2018 - 08:52

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యూపీలోని బరేల్లీలోని ప్రాంతానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక పాము కాటుకు గురైంది. దీంతో ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం ఐసీయూలోకి బాలికను తరలించారు.

అదే రోజు రాత్రి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి, మరో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఐసీయూలోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఆ బాలికను జనరల్‌ వార్డుకి తరలించారు. అనంతరం బాలికి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాలికను విచారించి కేసు నమోదు చేసుకున్నారు. ఆస్పత్రికి చెందిన సిబ్బంది ఒకరు, మరో నలుగురిపై  కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ