రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
వెండినాణెం,రూ. 250 కోసం బాలుడి హత్య
Published on Fri, 12/14/2018 - 11:01
సాక్షి, పాట్నా : వెండినాణెం, రూ. 250 దొంగతనం చేశాడన్న అనుమానంతో మైనర్ బాలున్ని హత్యచేసి గంగానదిలో పడేశాడో యువకుడు. ఈ సంఘటన బీహార్లోని పాట్నాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బీహార్లోని పాట్నాకు సమీపంలో గల నయాగాన్ అనే గ్రామానికి చెందిన11 ఏళ్ల మహమద్ ఆలామ్ డిసెంబర్ 9నుంచి కనపడకుండా పోయాడు. అతని కుటుంబసభ్యులకు చివరిసారిగా ఆలామ్ను లోహినిపూర్కు చెందిన చందన్తో వెళ్లటం గుర్తుకువచ్చింది. చందన్పై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలామ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చందన్ను అదుపులోకి తీసుకున్నారు.
చందన్ను విచారించగా తానే ఆలామ్ను చంపినట్లు అతడు ఒప్పుకున్నాడు. పోలీసు అధికారి మాట్లాడుతూ..‘‘ గ్రామస్తులు ఛత్ సందర్భంగా గంగానదిలో వెండినాణెలు వేస్తుంటారు. ఆ వెండినాణేలు బయటకు తీసి అమ్మి చందన్, ఆలామ్లు సొమ్ము చేసుకునేవారు. ఓ రోజు చందన్ దగ్గర ఉన్న వెండి నాణెం, రూ.250 పోయాయి. అతడికి ఆలామ్ మీద అనుమానం వచ్చి అడగగా తీయలేదని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన చందన్ అతడి కాళ్లు, చేతులు కట్టిగా కట్టి గొంతునులిమి చంపి గంగానదిలో పడేశాడు. అతని వాగ్మూలంతో హతుడు ఆలామ్ మృతదేహన్ని వెలికితీశామ’’ని వెల్లడించారు.
Tags