amp pages | Sakshi

రైలు పట్టాలు దాటుతూ యువకుడి మృతి

Published on Thu, 02/14/2019 - 08:41

తూర్పుగోదావరి, సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ఓ యువకుడిని బుధవారం రైలు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. దివిలి గ్రామానికి చెందిన దూసనపూడి భవానీప్రసాద్‌ కాంట్రాక్టు వర్క్‌లు చేస్తూ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి విజయవాడ వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి బయలు దేరిన సమయంలో సామర్లకోటలో ఉన్న అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి అక్కడి నుంచి విజయవాడ వెళతానని చెప్పిన తన కొడుకు అదే ప్రదేశంలో విగతజీవయ్యాడని తల్లి పార్వతి బోరున విలపించింది.

స్వామి వారిని దర్శించుకొని రైల్వే స్టేషన్‌కు వచ్చే సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతుండగా సామర్లకోట నుంచి విశాఖపట్నం వెళుతున్న రైలు ఢీ కొంది. దీంతో బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి చనిపోవడంతో అమ్మను చెల్లెలను పోషించాల్సిన బాధ్యత భవానీ ప్రసాద్‌పై ఉంది. ఈ సమయంలో కుటుంబానికి ఆసరా లేకుండా పోయిందని తల్లి, చెల్లెలు, బంధువులు రోదించిన తీరువులు రోదించారు. సంఘటనా ప్రదేశానికి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు చేరుకొని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు బాబ్జిరావు, త్రినాథ్‌ల సహకారంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. దివిలి గ్రామానికి చెందిన బంధువులు, మృతుడి స్నేహితులు రైల్వే పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో రైల్వేస్టేషన్‌  ఆవరణ విషాద వాతావరణం నెలకొంది. కేసు నమోదు చేసి రైల్వే హెచ్‌సీ జె. గోవిందరావు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)