వివాహిత ఆత్మహత్యాయత్నం

Published on Thu, 01/10/2019 - 09:25

విశాఖపట్నం, నర్సీపట్నం: భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. పట్టణానికి చెందిన   దుర్గాప్రసాద్‌  ఇదే గ్రామానికి చెందిన వసుంధర అనే యువతి ఏడేళ్లుగా ప్రేమించుకుని, ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వీరి వివాహాన్ని దుర్గాప్రసాద్‌ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వీరిద్దురూ పట్టణంలోనే  వేరుగా కాపురం ఉంటున్నారు. కొంతకాలంగా వీరి  మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో  దుర్గా ప్రసాద్‌...భార్య వసుంధరను వేధింపులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక బుధవారం ఉదయం భర్త ఇంటి ముందే వసుంధర బ్లేడ్‌తో చేయికోసుకుంది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో అపస్మారిక స్థితికి చేరుకుంది.

స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘన స్థలానికి వెళ్లి వసుంధరను ఏరియా ఆస్పత్రికి తరలించారు.  వసుంధర మాట్లాడుతూ దుర్గాప్రసాద్‌తో తనకు ఆరు నెలల క్రితం వివాహం జరిగిందని తెలిపింది. మూడు నెలల  గర్భాన్ని తన భర్త తీయించేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. కట్నం తీసుకురమ్మని భర్త నిత్యం వేధిస్తున్నానడని తెలిపింది. గర్భం పోవడంతో పాటు భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేశానని  తెలిపింది. తనను వేధిస్తున్న భర్త దుర్గాప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. తన భర్తపై గతంలో  ఫిర్యాదు చేశానని అయినా పోలీసులు పట్టించుకోలేదని వసుంధర తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని సీఐ సింహాద్రినాయుడు తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ