భార్యపై అనుమానంతో..

Published on Fri, 12/21/2018 - 19:04

చిన్నమండ్యం: వైఎస్సార్‌ జిల్లా చిన్నమండ్యం మండలం చాకిబండలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని కిరాతకంగా కొడవలితో దాడిచేశాడు. అడ్డొచ్చిన అత్తను సైతం కొడవలితో నరికాడు. ఈ ఘటనలో భార్య గంగా దేవి అక్కడికక్కడే మృతిచెందగా..గంగాదేవి తల్లి మల్లమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం మల్లమ్మను తిరుపతికి తరలించారు.

ఘటన అనంతరం నిందితుడు ఆంజనేయులు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుపాలు కావడంతో కూతరు తేజేశ్వరీ, కుమారుడు శ్రీనాథ్‌లు అనాధలయ్యారు. ఆంజనేయులు గల్ఫ్‌ నుంచి ఇటీవలే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ