amp pages | Sakshi

ఇక.. ఆ కుటుంబంలో ఎవరూ లేరు!

Published on Sat, 08/11/2018 - 14:05

కృష్ణాజిల్లా, పెనమలూరు: తల్లి ఎప్పుడో మృతిచెందింది. తండ్రి, కుమారుడు కలిసి ఉంటున్నారు. ఆ తండ్రి కూడా అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. తండి మృతిచెందిన విషయాన్ని ఎవరికీ చెప్పకుండా వారం రోజుల పాటు ఇంటిలోనే ఉంచి పూజలు చేశాడు కుమారుడు. రెండు నెలల క్రితం కానూరులో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న కుమారుడు కూడా గురువారం అనుమానాస్పదస్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని కుటుంబంలో ఎవ్వరూ లేకుండా పోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. కానూరు వృద్ధుల ఆశ్రమం రోడ్డులో విశ్రాంత ఇంజినీర్‌ కొండూరు కోటేశ్వరరావు, కుమారుడు రామలింగేశ్వరరావుతో కలిసి జీవిస్తున్నాడు. కోటేశ్వరరావు రెండు నెలల క్రితం ఇంట్లో అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. మానసిక స్థితి సరిగాలేని అతని కుమారుడు రామలింగేశ్వరరావు (45)తండ్రి చనిపోయినా ఎవ్వరికీ చెప్పకుండా మృతదేహానికి పసుపు, కుంకుమ రాసి కాళ్లకు స్కేటింగ్‌ షూస్‌ వేసి ఇంట్లోనే వారం రోజుల పాటు శవాన్ని ఉంచుకున్నాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తండ్రి కోటేశ్వరరావు మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నేటికీ కోటేశ్వరరావు ఎలా మృతిచెందాడనేది తెలియరాలేదు. 

ఇప్పుడు రామలింగేశ్వరరావు కూడా...
తండ్రి కోటేశ్వరరావు మరణం తరువాత రామలింగేశ్వరరావుకు చికిత్స చేయించేందుకు మేనమామలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ అతనిని విశాఖపట్నం తీసుకువెళ్లారు. అక్కడ అతనికి చికిత్స చేయించారు. ఈనెల మొదటివారంలో రామలింగేశ్వరరావు కానూరు వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 7న మేనమామలు వచ్చి రామలింగేశ్వరరావును చూసి వెళ్లారు. మరలా గురువారం మేనమామలు ఇంటికి వచ్చి చూడగా రామలింగేశ్వరరావు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదుచేశారు. 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)