amp pages | Sakshi

అన్నదాతను కాటేసిన కరెంట్‌

Published on Fri, 08/24/2018 - 08:55

మహేశ్వరం రంగారెడ్డి : పొలంలో నేలపై పరిచిన విద్యుత్‌ తీగలు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై ఓ రైతు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని సుభాన్‌పూర్‌ గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ కొరని సునీల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సుభాన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఎర్ర యాదయ్య(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన కావలి మణెమ్మ పొలంలో కూలీకి వెళ్లాడు.

పక్క పొలం రైతు కావలి రాఘవేందర్‌ విద్యుత్‌ అధికారుల అనుమతి లేకుండా సర్వీస్‌ వైర్‌ను నేలపై పరిచి విద్యుత్‌ స్తంభం నుంచి అక్రమంగా కనెక్షన్‌ పొంది పొలం సాగుచేస్తున్నాడు. కూలి పని ముగించుకున్న ఎర్ర యాదయ్య కావలి రాఘవేందర్‌ పొలం  మీదుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో నేలపై పరిచిన విద్యుత్‌ వైర్‌ తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గమనించిన  స్థానిక రైతులు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా యాదయ్య మృతిచెంది కనిపించాడు. ఈ విషయాన్ని స్థానిక రైతులు గ్రామ పెద్దలు, పోలీసులు, విద్యుత్‌ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.  

పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం 

అనుమతి లేకుండా విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసుకొని తీగలను నేలపై పరవడంతో యాదయ్య మృతి చెందాడని పోలీసులు తెలిపారు. నేలపై విద్యుత్‌ తీగలు పరిచి తన భర్తకు చావుకు కారణమైన సదరు రైతు రాఘవేందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య బాలమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

యాదయ్య విద్యుత్‌ షాక్‌కు గురై దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్‌ అధికారుల అనుమతి లేకుండా అనాధికారంగా సర్వీస్‌ వైర్‌ను స్తంభానికి తగిలించడంతో నేలపైన విద్యుత్‌ వైర్‌ తేలి ఉండడంతో కాలికి తగిలి యాదయ్య మరణించారని విద్యుత్‌ ఏఈ గోపయ్య తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేలా కృషి చేస్తామని ఏఈ తెలిపారు.  

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)