amp pages | Sakshi

అనుమానం పెనుభూతమై..

Published on Wed, 08/08/2018 - 14:53

కేతేపల్లి(నకిరేకల్‌)  నల్గోండ : తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భర్త ఆమెపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత తాను వ్యవసాయ బావి వద్ద విద్యుత్‌ తీగలు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన జటంగి భిక్షమయ్య–లింగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.

వీరిలో పెద్ద కుమారుడు జటంగి శ్రీనివాస్‌(33)కు సూర్యాపేట మండలం కాసరబాద్‌కు చెందిన రజితతో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తుంగతుర్తి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 11 ఏళ్ల కూతురు నవ్య,  9 ఏళ్ల కుమారుడు కార్తీక్‌ సంతానం ఉన్నారు. వివాహం జరిగిన ఐదేళ్ల వరకు వీరి  కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో రజితను ఆమె భర్త తరుచూ వేధించసాగాడు.

ఈక్రమంలో పలుమార్లు ఇరువురు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగాయి. అయినా శ్రీనివాస్‌ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఏడాది కిత్రం రజిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లిగారి ఊరైన కాసరబాదుకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని పిల్లలను పోషించుకుటుంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌ వివాహేతర సంబంధం పేరుతో తాను వేధించనని, భార్య, పిల్లలతో కలసి ఉంటానని నాలుగు నెలల కిత్రం కాసరబాదుకు వెళ్లి  భార్య పిల్లలను తన ఇంటికి తీసుకువచ్చాడు.

అయినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. వివాహేతర సంబంధం పేరుతో మళ్లీ వేధించసాగాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ఇరువురి మద్య ఏం జరిగిందో ఏమో కానీ శ్రీనివాస్‌ తన భార్య రజిత కాళ్లు, చేతులపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న రజితను చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మనస్తాపానికి గురైన భర్త..

భార్యపై దాడి చేసిన శ్రీనివాస్‌ మనస్తాపానికి గురై తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ చేతికందే ఎత్తులో కిందకు వేళాడుతున్న 11కేవీ విద్యుత్‌ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విద్యుదాఘాతానికి లోనయిన శ్రీనివాస్‌ పొలంలో ఉన్న బురదలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇది గమనించిన చుట్టు పక్కల రైతులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే శ్రీనివాస్‌ మృతి చెందాడు. పొలం బురదలో పడి ఉన్న శ్రీనివాస్‌ మృతదేహాన్ని అతికష్టం మీద గ్రామస్తులు ఒడ్డుకు చేర్చారు.

సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ

సమాచారం తెలుసుకున్న శాలిగౌరారం సీఐ కాస్ట్రోరెడ్డి, కేతేపల్లి ఎస్‌ఐ రజనీకర్‌రెడ్డి సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన శ్రీనివాస్‌ చిన్న సోదరుడు నాగయ్య సైతం భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నాగయ్యను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.  

Videos

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)