అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంట్లో అందర్నీ చంపేసి.. తాను కూడా
Published on Sat, 08/03/2019 - 11:10
చండీగఢ్ : పంజాబ్లో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన కుటుంబ సభ్యులపై విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడి వారిని హతమార్చాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. సందీప్ సింగ్(27) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పాటు నథువాల్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. తన తాతయ్య, అమ్మా, నాన్నా, సోదరి ఆమె మూడేళ్ల కూతురిని తుపాకీతో కాల్చి...అనంతరం తన శరీరంలోనూ బుల్లెట్లు దించుకున్నాడు.
కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని...విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సందీప్ తాతయ్య శరీరంలో లభించిన బుల్లెట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#
Tags