amp pages | Sakshi

రైలుకు ఎదురుగా వెళ్లి ప్రేమజంట ఆత్మహత్య 

Published on Wed, 11/20/2019 - 08:37

సాక్షి, చెన్నై : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న వేదనతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని అతి వేగంగా దూసుకొచ్చిన  రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఎదురుగా వెళ్లి బలన్మరణానికి పాల్పడ్డారు. బన్రూటిలో చోటు చేసుకున్న ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కడలూరు జిల్లా బన్రూటి సమీపంలోని కొట్లాంబాక్కం గ్రామానికి చెందిన ఆదిమూలం కుమారుడు మారి అలియాస్‌ మదన్‌(22). ఇతను మెకానిక్‌గా ఓ షెడ్డులో పనిచేస్తున్నాడు. తోరపాటి గ్రామానికి చెందిన పాండురంగన్‌ కుమార్తె స్వాతి అలియాస్‌ శ్వేతను మదన్‌ ప్రేమిస్తున్నాడు.

రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉండటంతో తరచూ శ్వేత ఇంటికి సైతం మదన్‌ వెళ్లి వచ్చేవాడు. అంతే కాదు, నర్సింగ్‌ చదువుతున్న స్వేతను సాయంత్రం వేళల్లో తన మోటార్‌ సైకిల్‌ మీద ఇంటికి తీసుకెళ్లి మరీ దిగబెట్టి వచ్చేవాడు. ఈ ఇద్దరు ప్రేమించుకున్న విషయం కుటుంబీకులకు తొలుత తెలియదు. అయితే, తమ ప్రేమను కుటుంబీకులు  అంగీకరిస్తారా..? అన్న ఆందోళన వీరిని వెంటాడుతూ వచ్చింది. ఏడాది కాలంగా ప్రేమించుకుంటూ వచ్చిన ఈ జంట తాము జీవితంలో ఒక్కటయ్యేది అనుమానమే అన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఎట్టకేలకు ధైర్యం చేసి కుటుంబీకుల దృష్టికి తీసుకెళ్లినా, వారు అంగీకరించక పోవడంతో బలన్మరణానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో సోమవారం కళాశాలకు వెళ్లిన శ్వేత తిరిగి ఇంటికి రాలేదు. అయితే, ఆమె చదువుకుంటున్న కళాశాల ఆస్పత్రిలో ట్రైనింగ్‌ నిమిత్తం చేరి ఉండటంతో అప్పుడప్పడు రాత్రుల్లో ఇంటికి వచ్చేది కాదు. దీంతో తల్లిదండ్రులు ఆస్పత్రి విధులకు వెళ్లి ఉంటుందని భావించారు.  

పట్టాలపై మృతదేహం..... 
మంగళవారం ఉదయం శ్వేత, మదన్‌ల మృత దేహాలు రైల్వే ట్రాక్‌ వద్ద పడి ఉన్నట్టుగా సమాచారం అందుకున్న రెండు కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. అస్సలు ఏంజరిగిందోననే ఆందోళనతో కుటుంబీకులు పరుగులు తీశారు. అయితే, ఈ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. అర్థరాత్రి సమీపంలో చెన్నై నుంచి రామేశ్వరం వైపుగా వెళ్లిన ఎక్స్‌ప్రెస్‌ రైలు డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కనిచ్చ పాక్కం రైల్వే గేట్‌ సమీపిస్తున్న సమయంలో అతి వేగంగా దూసుకొస్తున్న రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ ముందుగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఓ జంట ఎదురు వచ్చినట్టు , హారన్‌ కొట్టినా, వేగం తగ్గించే యత్నం చేసినా ఫలితం లేదని తిరుపాతి పులియూర్‌ రైల్వే పోలీసులకు ఆ డ్రైవర్‌ సమాచారం అందించి వెళ్లాడు. రైలు అతి వేగంగా వచ్చిన దృష్ట్యా, ఆ ఇద్దరి మృత దేహాలు చిద్రం అయ్యాయి. మృత దేహాల్ని కడలూరు ఆస్పత్రి మార్చురికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. ఈ ఘటన ఆయా కుటుంబాలు, గ్రామాల్లో విషాదాన్ని నింపింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)