amp pages | Sakshi

భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకుని.. 

Published on Sun, 06/24/2018 - 08:41

ఇల్లందకుంట(హుజూరాబాద్‌) : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలు, ఆపై అనుమానంతో భార్యను హతమార్చిన భర్త ఆపై తానూ ఉరేసుకుని, పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట స్వామిమల్లయ్య (48), పుట్ట రాధ(45) భార్యాభర్తలు. వీరి కి ఇద్దరు కుమారులు శ్రీకాంత్, రాజు , కూతురు స్వప్న సంతానం. వీరికున్న ఎకరంతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని.. సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నారు. ఇద్దరు కొడు కులు చదువుల నిమిత్తం హన్మకొండ వెళ్లారు. స్వప్న కొడుకులు శ్రావణ్, మనోజ్‌ వీరితో నే ఉంటున్నారు.  

అనుమానం.. వేధింపులు 
రాధపై అనుమానం పెంచుకున్న మల్లయ్య భార్యను వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసి.. ఇంటికొచ్చిన దంపతులు మరోసారి గొడవకు దిగారు. కోపోద్రిక్తుడైన మల్లయ్య కర్రతో భార్యపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే చనిపోయింది. దీంతో భయానికి గురైన మల్లయ్య ముందుగా క్రిమిసంహారక మందుతాగాడు. అనంతరం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి  తలుపులు తెరిచిచూడగా.. ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. పక్క గదిలో పడుకున్న చిన్నారులు అరుస్తూనే ఉన్నారు.  

పరిశీలించిన ఏసీపీ 
సిరిసేడు గ్రామంలో దంపతులిద్దరూ మృత్యువాతపడిన సంఘటన తెలుసుకున్న హుజూరాబాద్‌ ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్, సీఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని  హత్యకు, ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఈర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)