పట్టాలు తప్పిన గూడ్స్‌

Published on Wed, 10/18/2017 - 08:29

గుంతకల్లు: గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు సమీపంలోని పడమటి గుంతకల్లు సేష్టన్‌ యార్డులో మంగళవారం గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. దీంతో రైల్వేకు సూమారు రూ.10 కోట్ల  మేర నష్టం వాటిల్లి ఉండవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి. ఘటనకు వివరాల్లోకెళితే...  నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలోని బేలాయ్‌ ఉక్కు కర్మాగారం నుండి హుబ్లీ జోనల్‌ కేంద్రమైన హుబ్లీకి ఇనుప కంబీలు (రైల్స్‌)ను రైల్వే డిపార్టుమెంట్‌కు చెందిన ప్రత్యేక గూడ్స్‌రైలు (20 ఆర్‌పీ బీటీ) ద్వారా తరలిస్తున్నారు. ఈ రైలు మార్గ మధ్యలో  అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వెస్ట్‌ గుంతకల్లు రైల్వేసేష్టన్‌ యార్డులో 254/2–3 కి.మీ వద్ద  మెయిన్‌లైన్‌  నుంచి లూప్‌లైన్‌ లోకి ప్రవేశిస్తుండగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో దాదాపు 5 వ్యాగిన్లు పట్టాలు తప్పాయి. 24 వ్యాగిన్లతో వెళ్తున్న ఈ రైలు ఇంజన్‌ 7వ వ్యాగిన్‌ నుంచి వరుసగా 12వ వ్యాగిన్‌ వరకు పట్టాల నుంచి పక్కకు ఒరిగాయి. ఇందులో ఎన్‌సీఆర్‌ 135601, 35162 వ్యాగిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతకల్లు–బళ్లారి రైలు మార్గం డబుల్‌లైన్‌ కావడంతో మరో లైన్‌లో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

ఈ ఘటనతో దాదాపు 300 మీటర్ల మేర రైలు మార్గం ధ్వంసం కావడంతో పాటు సమాచార వ్యవస్థ దెబ్బతినింది. వ్యాగిన్లు, రైలు మార్గం, స్లీపర్లు, రోలింగ్‌ స్టాక్, సమాచార వ్యవస్థ ధ్వంసం కావడంతో సుమారు రూ.10 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. డీఆర్‌ఎం విజయ్‌ప్రతాప్‌సింగ్‌తో పాటు సీనియర్‌ డీఎంఈ (సీఅండ్‌డబ్ల్యూ) వెంకటరావు, సీనియర్‌ డీఈఎన్‌ (కోఆర్డినేషన్‌) సిద్ధేశ్వరరావు, సీనియర్‌ డీసీఎం రాకేష్, సీనియర్‌ డీఈఈలు రాజేంద్రకుమార్, అంజయ్య, డీసీఎం నాగేంద్రప్రసాద్, డీఈఎన్‌ (వర్క్‌) నవ్యశ్రీతో పాటు ఆయా విభాగాల అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

దాదాపు 500 మందికి పైగా  రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న సమాచార వ్యవస్థను పునరుద్ధరించారు. ప్రమాద కారణంగా హుబ్లీ–విజయవాడ, హుబ్లీ–తిరుపతి ప్యాసింజర్లు, హైదరాబాద్‌–కోల్హాపూర్, విశాఖపట్నం–హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు డౌన్‌లైన్‌ రైలు మార్గం గుండా అలస్యంగా నడిచాయి.

నిర్లక్షమే కారణమా?
పడమటి గుంతకల్లు రైల్వే సేష్టన్‌ యార్డులో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం రైలు మార్గ నిర్వహణ లోపమే అయి ఉండొచ్చని రైల్వే వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనలు ప్రకారం అధిక టన్ను బరువుతో (రైల్స్‌) ప్రయాణిస్తున్న ఈ గూడ్స్‌ రైలు ప్రధాన మార్గం గుండా వెళ్లాలి. సిబ్బంది అజాగ్రత్త కారణంగా మొయిన్‌ లైన్‌ నుంచి లూప్‌లైన్‌ మళ్లించడంతో ప్రమాదనికి గురై ఉండొచ్చునని త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. 

విచారణ చేస్తున్నాం
ప్రమాద సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాం. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాం. బాధ్యులెవరైనా సరే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– విజయ్‌ప్రతాప్‌ సింగ్, డీఆర్‌ఎం

Videos

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Photos

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)