బాలిక కిడ్నాప్‌?

Published on Tue, 12/10/2019 - 03:19

హసన్‌పర్తి: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్‌ నుంచి కిడ్నాప్‌కు గురైన ఓ బాలికను హసన్‌పర్తి పోలీసులు సోమవారం కాపాడినట్లు తెలిసింది. భీమదేవరపల్లికి చెందిన ఇంటర్మీడియెట్‌ చదువుతున్న ఓ విద్యార్థిని రెండు రోజుల క్రితం ఎల్కతుర్తిలోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో స్నేహతురాలిని కలవడానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె బస్సు కోసం వేచి చూస్తుండగా హసన్‌ పర్తి మండలం అన్నాసాగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి వివిధ ప్రాంతాల్లో తిప్పాడు.

రాత్రి కావడంతో ఆ బాలికను హసన్‌పర్తి మండలం వంగపహాడ్‌లో ఉంటున్న తన సోదరి వద్దకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఉదయం ఆ బాలిక తనను కిడ్నాప్‌ చేశారని డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు బాధితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ యువకుడి ఫోన్‌ ఆధారంగా హసన్‌పర్తి మండలం అన్నాసాగరంగా గుర్తించి గ్రామంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ