అనుమానాస్పద స్థితిలో ఆశ్రమ బాలిక మృతి

Published on Sat, 02/03/2018 - 20:07

రాయగడ : రాయగడ జిల్లా కల్యాణసింగుపురం సమితి నారాయణపూర్‌ పంచాయతీ పరిధిలోని సిరిపూర్‌ గ్రామంలో ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక్కడ 8వ తరగతి చదువుతున్న కబిత హీకాక(13) అనే విద్యార్థిని గత నెల 31వ తేదీన మేడపై మృతి చెంది కనిపించింది. తోటి విద్యార్థినులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. డేప్పుగుడ గ్రామానికి చెందిన కబిత హీకాక సిరిపూర్‌ గ్రామంలో ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. గత నెల 31వ తేదీన సాయంత్రం ఈ ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ మేడపై బట్టులు ఆరేవేసేందుకు కబిత హీకాక వెళ్లింది. అయితే ఎంతసేపటికి ఆమె రాకపోవడంతో తోటి విద్యార్థిని మేడపైకి వెళ్లి చూడగా కబిత హీకాక శరీరంపై తీవ్ర గాయాలై కిందపడి ఉంది. వెంటనే ఆ బాలిక విషయాన్ని హాస్టల్‌ సిబ్బందికి తెలిపింది.

వెంటనే హాస్టల్‌ సిబ్బంది, ఏఎన్‌ఎం కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్టు డాక్టర్‌ నిర్ధారించారు. ఈ విషయం డేప్పగుడలో బాలిక తల్లిదండ్రులకు హాస్టల్‌ సిబ్బంది తెలియజేశారు. వారు వచ్చి మృతదేహం వద్ద బోరున విలపించారు. తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు మృతి కాదని ఆవేదన చెందారు. దీంతో పోలీసులు పోస్టుమార్టం చేసేందుకు గురువారం నిర్ణయించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అలాగే రాయగడ ఐటీడీఏ పీఓ మురళిధర్‌స్వొయి, డీడబ్ల్యూఓ పాత్రో బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీసులు, జాగిలాలతో విచారణ జరిపారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ