ఉద్యోగాల పేరుతో మోసం

Published on Wed, 12/19/2018 - 12:29

పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్‌:  ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతూ, వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగ యువతను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తోన్న ఓ వ్యక్తిని ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు త్రీటౌన్‌ సీఐ ఎన్‌.రాజశేఖర్, ఎస్సై ఎ.పైడిబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా భైరవుని పాడు గ్రామానికి చెందిన జింకాల గోపిరాజు అలియాస్‌ గోపి, షేక్‌ సుభాని అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఏలూరు కండ్రికగూడెంలో కార్పొరేట్‌ తరహాలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రభు త్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతకు ఆశచూపించి, ఒక్కొక్కరి నుంచి రూ.6 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు.

కొందరు యువత వారికి సొమ్ములు చెల్లించి రోజులు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవటంతో త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు. సీఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో ఎస్సై పైడిబాబు సిబ్బందితో కలిసి వారి ఫోన్‌ నంబర్‌ ఆధారంగా జింకాల గోపిరాజు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.14 వేల నగదు, టేబుల్, రిఫ్రిజిరేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. షేక్‌ సుభానీ పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఇద్దరూ సుమారు వంద మందికి పైగా నిరుద్యోగ యువతను మోసం చేసి దాదాపు రూ. 6 లక్షలకు పైగా సొమ్ములు వసూలు చేసినట్టు తెలుస్తోందని, మరో వ్యక్తి సుభానీని విచారణ చేస్తే మరింత సమాచారం వస్తుందని పోలీసులు చెప్పారు. గోపిరాజు తండ్రి వ్యవసాయం చేస్తుండగా, సుభానీ తండ్రి రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నారు. నిరుద్యోగ యువత ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు చెల్లించాలని చెబితే నమ్మవద్దని, ముందుగా సొమ్ములు చెల్లించటం సరైన విధానం కాదని సీఐ రాజశేఖర్‌ అన్నారు. యువత ఇటువంటి మోసాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ