amp pages | Sakshi

‘పెట్రోల్‌ దాడి’ ఘటనపై దర్యాప్తు వేగవంతం

Published on Fri, 01/24/2020 - 12:50

తూర్పుగోదావరి,కడియం: మండలంలోని దుళ్ల ముదిరాజుల పేటలో నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టిన సంఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ స్వయంగా కేసును పర్యవేక్షిస్తుండడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిందితుడిగా భావిస్తున్న మాసాడ శ్రీను నివాసం ఉంటున్న తిరుపతికి ప్రత్యేక బృందం చేరుకుని అతడి బంధువులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిందితుడుతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. పెట్రోల్‌ బంకు వద్ద సీసీ టీవీ ఫుటేజీలను బట్టి ఇది తెలుస్తోంది. దీంతో ఆ వ్యక్తి ఎవరన్న దిశలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈనెల 17న తన మేనత్తపై దాడి సమయంలో శ్రీను కూడా మరో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తి కోసం కూపీలాగుతున్నారు. అలాగే బాధితులు, నిందితుల బంధువులు, స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు.

గొళ్లెం పెట్టడమే కీలకం..
నిద్రపోతున్న ఆరుగురిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి, ఆ గది తలుపులకు బయట వైపు గొళ్లెం పెట్టడంపై ప్రస్తుతం పోలీస్‌లు దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ గదితో పాటు పక్కనే ఉన్న ఇంటి యజమాని గదికి కూడా గొళ్ళెం పెట్టారు. 17వ తేదీన కూడా మేనత్త సత్యవతిపై దాడి సమయంలో ఇదే విధంగా యజమాని నిద్రపోతున్న గదికి మాసాడ శ్రీను గొళ్లెం పెట్టి, గొడవకు సిద్ధమైనట్టు తెలిసింది. పెట్రోల్‌ దాడి ఘటనలో కూడా అదే విధంగా తలుపులకు గొళ్లెం పెట్టడంతో నిందితుడు మాసాడ శ్రీనుగానే పోలీస్‌ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అలాగే పెట్రోల్‌ బంకులో వంద రూపాయల పెట్రోల్‌ను ప్లాస్టిక్‌ సీసాలో పోయించుకున్నప్పుడు మరో వ్యక్తి మోటారు సైకిల్‌పై ఉన్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. 17న దాడి సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులే వచ్చారు. తలుపులకు గొళ్లెం పెట్టడం, ఇద్దరు వ్యక్తులు ఉండడం, దాడికి కొద్ది సేపటి ముందే సీసాలో పెట్రోలు పోయించుకోవడం వంటి విషయాలను గమనిస్తే మాసాడ శ్రీనే నిందితుడై ఉండొచ్చని బలంగా విశ్వసిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

మూడు రోజులు మృత్యువుతో పోరాడి..
రాజమహేంద్రవరం క్రైం: కాలిన గాయాలతో మూడు రోజులు గా నరకయాతన అనుభవించి, మృత్యువుతో పోరాడి మరో మహిళ మృతి చెందింది. దుళ్ల గ్రామంలో ఉన్మాది ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన సంఘటనలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటనలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గంటా దుర్గా భవాని(23) మృతి చెందింది.  ఈ సంఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.

పాపం చిన్నారులు
కళ్ల ముందే చెల్లెలు విజయలక్ష్మి, మేనమామ కోట్ని రాము అగ్నికి ఆహుతి కాగా బియ్యం పెట్టె చాటున దాక్కొని స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయట పడిన గంటా ఏసు కుమార్, గంటా దుర్గా మహేష్‌లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయాలతో విలవిల్లాడుతున్నారు. తల్లి, చెల్లి, అమ్మమ్మ, మేనమామ ఇలా నలుగురినీ ఒకేసారి కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగిపోయారు. తల్లి చనిపోయిందనే సమాచారం ఆ చిన్నారులకు బంధువులు చెప్పకపోవడంతో ఆమె రాకకోసం వారు బెంగగా ఎదురు చూస్తున్నారు.

కుటుంబ సభ్యులకుమృతదేహాలు అప్పగింత
ఈ సంఘటనలో మృతి చెందిన మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు కోట్ని సత్యవతి భర్త అప్పారావు(నిందితుడిని పట్టుకునేందుకు ఆచూకీ కోసం పోలీసులు తిరుపతి తీసుకువెళ్లారు.) అందుబాటులో లేకపోవడంతో అల్లుడు గంటా భద్రరాజు మామతో ఫోన్‌లో మాట్లాడి సత్యవతి, దుర్గా భవానీల మృతదేహాలకు రోటరీ కైలాస భూమికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు అయిన ఖర్చును వైఎస్సార్‌ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి బాధితులకు అందించారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)