వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిరునవ్వును చిదిమేశాడు
Published on Mon, 12/31/2018 - 01:54
పాలకవీడు: పెంచిన చేతులే తుంచేశాయి. అల్లారుముద్దుగా పెంచి న కొడుకు మానసిక వికలాంగుడు అని కూడా చూడకుండా ఓ తండ్రి మద్యం మత్తులో గొంతు నులిమి చంపేశాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం బెట్టె తండాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాలోతు బాలు వ్యవసా యం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కుమారుడు పవన్ (10)తో పాటు ఆరేళ్ల పాప ఉంది. పవన్ పుట్టుకతోనే మానసిక వికలాం గుడే కాక కాళ్లు చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. కుమారుడి పరిస్థితిని చూడలేక గొంతు నులిమి చంపేశాడు. ఆ సమయంలో తల్లి పొలం పనులకు వెళ్లింది. తండ్రి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ సుదర్శన్రెడ్డి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
#
Tags