amp pages | Sakshi

సేవ ముసుగులో కుచ్చుటోపి

Published on Thu, 08/09/2018 - 12:59

కరీంనగర్‌ క్రైం: కేసీఆర్‌ సేవాదళం స్వచ్ఛందసంస్థ పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుని, పలువురికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కట్కోజుల రమేశ్‌చారితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కరీంనగర్‌ కమిషనరేట్‌లో బుధవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌కు చెందిన కట్కోజుల రమేశ్‌చారి ఇంటర్‌వరకు చదువుకున్నాడు. పీజీ చేశానని చెప్పుకుంటూ నకిలీ సర్టిఫికెట్లతో చలామణి అయ్యాడు. మూడేళ్ల క్రితం కేసీఆర్‌ సేవాదళం పేరుతో ఉన్న స్వచ్ఛంద సంస్థ లో చేరాడు.

దానికి ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటూ పలు సామాజిక సేవలు చేస్తున్నట్లు ఫొటోలు దిగి.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నాడు. తనకు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించుకొచ్చాడు. ఇలా మూడేళ్లలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలలో సుమారు 40మంది నుంచి రూ.85 లక్షలు వసూలు చేశాడు. వారిని నమ్మించడానికి చెక్కులు, ప్రామీసరి నోట్లు రాసిచ్చేవాడు.
 
ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని... 
జయశంకర్‌ భూపాపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమెలపల్లి గ్రామానికి చెందిన సిద్దిజు రమేశ్‌చారిని ఏజెంటుగా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు వçసూలు చేసి ఇద్దరూ పంచుకున్నారు. అదే విధంగా నాంపెల్లి రాజ్‌కుమార్‌ ఐఎఫ్‌ఏ సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానని రమేశ్‌చారితో కలిసి మోసాలకు పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ.6 లక్షలు వసూలు చేసి ఇద్దరు పంచుకున్నారు.

చొప్పదండి మండలం వెదురుగట్ల గ్రామానికి చెందిన అమరిశెట్టి రామచంద్రం రమేశ్‌చారికి రూ.12 లక్షలు వసూలు చేసిఇచ్చి, రూ.2లక్షలు కమీషన్‌గా తీసుకున్నాడు. జగిత్యాలకు చెందిన మహ్మద్‌ జునైద్‌ రమేశ్‌చారితో కలిసి రూ.10లక్షల వరకు నిరుద్యో గుల నుంచి వసూలు చేశాడు. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన అంజనేయులుతో కలిసి రూ.4.50 లక్షలు వసూలు చేశాడు. వీటిలో అంజనేయులు రూ.3లక్షలు తీసుకున్నాడు. హుస్నాబాద్‌కు చెందిన నూనే శ్రీనివాస్‌ రూ. 4.80లక్షలు వసూలు చేసి రూ.2లక్షలు కమీషన్‌గా తీసుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన రాజేంద్రప్రసాద్‌ నిరుద్యోగల నుంచి రూ. 25 లక్షలు వసూలు చేసి రమేశ్‌చారికి ఇచ్చాడు. ప్రస్తుతం రామచంద్రం, జునైద్, అంజనేయులు, నూనే శ్రీనివాస్, రాజేంద్రప్రసాద్‌ పరారీలో ఉన్నారు.

 తొమ్మిది కేసులు నమోదు 
కరీంనగర్, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలో సుమారు 40 మంది వరకూ బాధితులు ఉండగా కరీంనగర్‌లో 7, హుస్నాబాద్‌లో ఒకటి, వరంగల్‌లో ఒక కేసు నమోదైంది. మరికొంత మంది బాధితులు బయటకు వస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని సీపీ వెల్లడించారు.

పక్కా సమాచారంతో పట్టివేత 
కొంతకాలంగా రమేశ్‌చారిపై వరంగల్‌ జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగోతోంది. బాధితులు సైతం ఒక్కరొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌లో పలుకేసులు నమోదయ్యాయి. విచారణ చేపట్టిన టాస్క్‌ఫోర్స్, చొప్పదండి పోలీసులు రమేశ్‌చారి కదిలికలపై నిఘా పెట్టారు. బుధవారం వేకువజామున చొప్పదండికి రాగా పక్కాగా సమాచారంతో రమేశ్‌తో పాటు సిద్జోజు రమేశ్‌చారి, నాంపల్లి రాజ్‌కుమార్‌ను పట్టుకున్నారు. వారి నుంచి పలు ఖాళీ ప్రామిసరీ నోట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని , నిందితులను రిమాండ్‌ చేశారు.

మోసగాళ్లను నమ్మొద్దు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం అటెండర్‌నుంచి ఉన్నతపోస్టు వరకు ఎవరిని నియమించాలన్నా ఓ పద్ధతి ఉంటుంది. ప్రైవేట్‌ కంపెనీలు కూడా ఇంటర్వ్యూలు నిర్వహించే ఉద్యోగులను నియమించుకుంటారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉంది.
– కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్‌

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)