amp pages | Sakshi

1,381 కేజీల బంగారం సీజ్‌

Published on Thu, 04/18/2019 - 05:30

సాక్షి, తిరుపతి: ఎన్నికల వేళ తరలిస్తున్న క్వింటాళ్లకొద్దీ బంగారాన్ని తమిళనాడు అధికారులు బుధవారం పట్టుకున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మూడు వాహనాల్లో రవాణా చేస్తున్న 1,381 కేజీల బంగారు కడ్డీలను చూసి షాకైన అధికారులు.. ఆనక తేరుకుని వాటిని సీజ్‌ చేశారు. తమిళనాడులో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు తమిళనాట ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఇందులో తిరువళ్లూరు పుదుసత్రం వద్ద చెన్నై నుంచి తిరుపతి వైపు వెళుతున్న మూడు వాహనాలను ఆపిన అధికారులకు వాటిలో అనుమానాస్పదంగా ఉన్న ప్యాకెట్లు కనిపించాయి. వాటిని పూందమల్లి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి తరలించారు. 

భారీ పోలీసు బందోబస్తు నడుమ గిఫ్ట్‌ ప్యాక్‌ రూపంలో ఉన్న ప్యాకెట్లను తెరిచి చూశారు. ఆ ప్యాకెట్లలో బంగారు దిమ్మెలను గుర్తించి అవాక్కయ్యారు. పెద్దమొత్తంలో బంగారం పట్టుబడటంతో రిటర్నింగ్‌ అధికారి రత్న ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన పూందమల్లి తాలూకా కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో బంగారాన్ని ఏ రాజకీయ పార్టీకైనా ఇచ్చేందుకు తరలిస్తున్నారా, ఓటర్ల పంచేందుకు తీసుకెళుతున్నారా లేక స్మగ్లింగ్‌లో భాగంగా రవాణా చేస్తున్నారా అనే అనుమానంతో నలుగురినీ విచారణ జరుపుతున్నారు. పట్టుబడ్డ బంగారం స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై పూందమల్లి రిటర్నింగ్‌ అధికారి రత్న మాట్లాడుతూ వాహనాల తనిఖీల్లో 1,381 కిలోల బంగారం పట్టుబడిందని, దీనిని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ద్వారా స్విట్జర్లాండ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. 

అది శ్రీవారి బంగారమే
ఇదిలావుండగా, వాహనాల డ్రైవర్లు మాట్లాడుతూ.. ఈ బంగారు కడ్డీలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అప్పగించేందుకు తీసుకెళుతున్నట్టు వివరించారు. కొనుగోలు డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నట్టు తెలిపారు. దేవస్థానం అధికారుల వద్ద సరైన డాక్యుమెంట్లు ఉంటే బంగారాన్ని వారికి అప్పగిస్తామని, లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

టీటీడీ అధికారుల ఏమంటున్నారంటే..
తమిళనాడు పోలీసులు సీజ్‌ చేసిన బంగారం శ్రీవారికి చెందినదేనని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టీటీడీకి సంబంధించిన శ్రీవారి బంగారాన్ని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసినట్టు తెలిపారు. 20 రోజుల క్రితం గడువు తీరడంతో వాటిని రిలీజ్‌ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రెజరీకి తరలిస్తున్నట్టు టీటీడీ అధికారులు చెబుతున్నారు. అయితే బంగారాన్ని టీటీడీ ట్రెజరీకి తరలిస్తున్నట్టుగా బుధవారం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తెలిపారు. బ్యాంక్‌ అధికారులు మాత్రం బంగారం తరలింపుపై ఎన్నికల సంఘానికి లేఖ పంపినట్టు చెబుతున్నారు. దీనికి సంబంధించి అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయంటున్నారు. ఆధారాలను గురువారం తిరవళ్లూరు కలెక్టర్‌కు అందజేసి బంగారాన్ని టీటీడీకి చేరేలా చర్యలు తీసుకుంటామని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ అధికారులు వివరించినట్టు సమాచారం. ఇటీవల తిరుమల ఆలయంలో భారీఎత్తున ఆభరణాలు మాయమైనట్టు ఆరోపణలు వస్తున్న తరుణంలో చెన్నైలో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడటం అనేక అనుమానాలు తావిస్తోంది. 

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)