నా పెళ్లికి అప్పులు చేయొద్దు..

Published on Tue, 02/20/2018 - 03:12

గోపాల్‌పేట (వనపర్తి): తన పెళ్లి కోసం అప్పులు చేస్తున్నారని.. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇది మరింత భారం అవుతుందనే మనోవేదనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోగా.. తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో రెండు రోజుల్లో జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేటకు చెందిన బోడోల్ల నాగయ్య–పెంటమ్మ కుమార్తె స్రవంతి (19)కి ఈనెల 21వ తేదీన నాగర్‌కర్నూల్‌ మండలం తూడుకుర్తికి చెందిన రాజేశ్‌తో పెళ్లి నిశ్చయించారు.

అయితే, తల్లిదండ్రులు పెళ్లికోసం అప్పులు చేయాల్సి రావడంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న వారికి తన పెళ్లి మరింత కష్టం తెచ్చిపెట్టిందని భావించిన స్రవంతి ఆదివారం అర్ధరాత్రి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. దీనిని గమనించిన తండ్రి, సోదరుడు మంటలను అదుపు చేసి అంబులెన్స్‌లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె 80 శాతం కాలిపోవడంతో వైద్యులు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి పంపించారు. అక్కడ ఆమె నుంచి మేజిస్ట్రేట్‌ వాంగ్మూలాన్ని సేకరించారని ఎస్సై జగన్మోహన్‌ తెలిపారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ