amp pages | Sakshi

అయ్యో ! చాక్లెట్‌ అనుకుని విషం తిన్నారు

Published on Fri, 05/22/2020 - 09:07

సాక్షి, వైరా ‌: పొరపాటున విషపూరిత ఆహారం తిని బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తాటిపూడిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి అనే దంపతులు తాటిపూడి సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాంలో వాచ్‌మెన్లుగా పని చేస్తున్నారు. వీరికి స్టీఫెన్, యశ్వంత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. స్టీఫెన్‌ను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. కాగా గోదాంలో ఎలుకల తాకిడి అధికంగా ఉండడంతో వాటిని నివారించేందుకు చాక్లెట్‌ రూపంలో ఉండే విషపూరితపు ఆహారాన్ని తీసుకొచ్చి గోదాంలో ఉంచుతారు.

ఇదే క్రమంలో వెంకటేశ్వర్లు ఇంట్లో కూడా ఎలుకలు ఉన్నాయని గోదాం నుంచి మూడు చాక్లెట్‌లను తీసుకొచ్చి ఇంట్లోని బీరువా కింద ఉంచాడు. గురువారం ఇంట్లో ఎవరు లేకపోవడంతో స్టీఫెన్‌ (14) తన తమ్ముడు యశ్వంత్‌తో కలిసి ఇంట్లో ఆడుకుంటూ ఆ విషపూరిత చాక్లెట్‌ను ఇద్దరు అన్నదమ్ములు తిన్నారు. అవి చేదుగా ఉన్నాయని యశ్వంత్‌ సగం తిని ఉసివేశాడు. స్టీఫెన్‌ మాత్రం మొత్తం తినేశాడు. అనంతరం స్టీఫెన్‌కు కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అప్పటికే స్టీఫెన్‌కు వాంతులు, విరోచనలు అవుతుండడంతో తల్లిదండ్రులు ఇరువురిని హుటాహుటిన వైరాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ స్టీఫెన్‌ మృతి చెందాడు. యశ్వంత్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Videos

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు

చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..

ఎన్నికల ప్రచారంలో తన్నుకున్న టీడీపీ నేతలు

పెన్షన్ దారులకు తప్పని కష్టాలు..

ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైన బాబు, పవన్

నాడు YSR..నేడు జగన్..ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక..

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)