హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Published on Wed, 11/21/2018 - 08:55

ఖైరతాబాద్‌:  వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసారాంబాగ్‌ ప్రాంతానికి చెందిన మణికంఠ బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన పుట్టిన రోజు కావడంతో స్నేహితులు వెంకట రమణయ్యశెట్టి, పవన్‌కుమార్, వత్సల్‌తో కలిసి ఐ–10 కారులో అర్ధరాత్రి ఎన్టీఆర్‌మార్గ్‌కు వచ్చి  ఫొటోలు దిగారు.

అనంతరం లుంబినీ పార్క్‌ వైపునకు వెళ్తుండగా ఎన్టీఆర్‌ ఘాట్‌ సమీపంలో కారు అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌ వైపు దూసుకెళ్ళి ఇనుప గ్రిల్‌ను ఢీ కొని సాగర్‌లో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహదారుల సమాచారంతో సైఫాబాద్‌ పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ