amp pages | Sakshi

కేటీదొడ్డిలో హత్యల కలకలం

Published on Sat, 04/27/2019 - 07:51

గద్వాల క్రైం: కూలీ పనులకు వెళ్లిన సగటు వ్యక్తులు సాయంత్రం ఇంటికి వస్తారనే ఆశ..! పొలం పనులకు వెళ్లిన రైతన్న మాత్రం నేడు క్షేమంగా ఇంటికి వెళ్లలేని దుస్థితి. కరెంటు షాక్‌.. విష పురుగులు.. జంతువుల దాడిలో పొలం వద్ద రైతు మృతి చెందాడనే వార్త గ్రామాల్లో చోటుచేసుకునేవి.. కానీ, ఇప్పుడు మనుషులే ఒకరిపై ఒకరు హత్యలకు తెరతీస్తున్నారు. అర్ధరాత్రి హత్యలకు తెగబడుతున్నారు. ఓ కుటంబ వ్యవస్థను నిలువునా చీల్చి వేస్తున్న దారుణ సంఘటనలు ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలోకి నెట్టేస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఇటీవల కాలంలో రైతు హత్యలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇవిగో ఘటనలు 
ఠి మార్చి 8వ తేదీన కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన చంద్రబండ బోయ తిమ్మప్ప(35) అనే వ్యక్తి పని నిమిత్తం శుక్రవారం రాత్రి ఇంటి నుంచి దగ్గరలో ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లిన క్రమంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండు రోజుల తర్వాత వెలుగుచూసింది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు.

ఠి ఏప్రిల్‌ 23న కేటీదొడ్డి మండలం పాతపాలెంకు చెందిన కొలిమి వెంకటేష్‌(55) రోజూ మాదిరిగానే పొలానికి వెళ్లి రాత్రిపూట నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులలో దాడి చేసి హతమార్చారు. ఈయనను కూడా ఎందుకు హత్య చేశారనే విషయంపై స్పష్టత లేదు. పోలీసులు రెండు హత్యలపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నెల వ్యవధిలోనే వ్యవసాయ పొలాల వద్ద చోటు చేసుకున్న ఈ హత్యలపై మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
 
అసలు కారణమేంటి? 
ఈ రెండు హత్యల విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, పొలం తగాదాలు కారణమై ఉంటాయని ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి తప్పిదాలు సైతం హత్యకు కారణం కావచ్చనే గుసగుసులు వినిపిస్తున్నాయి. సొంత వ్యక్తులను తమ వర్గం వారే హత్య చేయాల్సిన పరిస్థితికి తీసుకువస్తున్నారు. అయితే ఈ రెండు హత్యల తీరును చూస్తే వివాహేతర సంబంధాలే కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొలిక్కిరాని కేసులు.. 
సాంకేతిక పరంగా పోలీసు శాఖ పలు కీలక కేసులను ఛేదించడంలో మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి. అయితే మార్చి నెల 8వ తేదీన హత్యకు గురైన వివరాలు ఇప్పటి వరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. కేసు దర్యాప్తులో భాగంగా ముమ్మరంగా ఆరా తీస్తున్నా హంతకుల ఆచూకీ తెలియలేదు. అలాగే ఏప్రిల్‌ 23న జరిగిన హత్య విషయంలోనూ జాగిలాలు గ్రామాల్లో పలు మార్గంలో హంతకులు వెళ్లినట్లు గుర్తించాయి. పోలీసులు సైతం కేసుల విషయంలో పలు కీలక ఆధారాలను సేకరించినప్పటికీ కేసు ఓ కొలిక్కి రాలేదు. దీంతో నిందితులు చిక్కరు.. దొరకరు అన్న చందంగా మారింది.

త్వరలోనే ఛేదిస్తాం.. 
కేటీదొడ్డి మండలంలో జరిగిన రెండు హత్య కేసులకు సంబంధించి హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించి తెలుసుకున్నాం. పలు కీలక ఆధారాల కోసం ఫోరెనిక్స్‌ నిపుణుల సహాయం తీసుకున్నాం. కేసుల విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే కేసులను ఛేదించి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. – హన్మంతు, సీఐ, గద్వాల 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌