రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వరికోత మిషన్ కింద పడి మహిళా రైతు మృతి
Published on Mon, 12/10/2018 - 11:01
సాక్షి, గణపురం : వరికోత మిషన్ కింద పడి మహిళా రైతు మృతిచెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మరావుపేట గ్రామానికి చెందిన చిన్నపాక సమ్మక్క(50) అదే గ్రామానికి చెందిన రైతు పోశాల రాజయ్య పొలంలోకి కూలీ పనులకు వెళ్లింది. వరికోత మిషన్ వరిని కోస్తూ వెనుక వైపు వెళ్లడంతో వెనుక పనిచేస్తున్న సమ్మక్కపై నుంచి మిషన్ వెళ్లింది. దీంతో సమ్మక్క అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణపురం ఎస్సై గోవర్ధన్ తెలిపారు. అధికారులు స్పందించి మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
#
Tags